Monday, April 4, 2011

కొత్త రాజబాపయ్య

కొత్త రాజబాపయ్య ప్రముఖ విద్యావేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా జాగర్లమూడిలో 1913 జులై 1వ తేదీన సామాన్య కర్షక కుటుంబములో రాజమ్మ, బుచ్చికోటయ్య దంపతులకు జన్మించాడు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహా మనీషి. విద్య :ప్రాధమిక విద్య ఊరిబడిలో చదివి, తెనాలి, కొల్లూరు ఉన్నత పాఠశాలలలో ఉన్నత విద్య పూర్తి చేసి, గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ చదివి, 1937లో బి.ఇ.డి చేశాడు. వృత్తి 1937-38 మధ్యకాలములో రేపల్లె ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా చేశాడు. 15 సంవత్సరాలు గణితోపాధ్యాయునిగా, 15 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయునిగా పనిచేశాడు. లెక్కల ఉపాధ్యాయునిగా మంచి పేరు సంపాదించాడు. పర్యవేక్షణ లేని పరీక్షలు జరిపి, వ్యతిరేకత ఎదురైనా పరీక్షలు చక్కగా నిర్వహించి విద్యాశాఖాధికారుల మెప్పు పొందాడు. కూచిపూడి కోగంటి వారి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నపుడు రాజబాపయ్య క్రమశిక్షణకు, లెక్కలు చెప్పే విధానానికి ముగ్ధులై విద్యార్ధులు ఎన్నో మైళ్ళ దూరం నుండి నడచి వచ్చి చదువుకునేవారు. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ప్రయోగాలు చేసిన రాజబాపయ్య విద్యాబోర్డులో, రాష్ట్ర విద్యా సలహా సంఘానికి సభ్యునిగా పనిచేశాడు. రాజబాపయ్య చేసిన విశిష్ఠసేవలకు గుర్తింపుగా 1964-65 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా తీసుకున్నాడు. వృత్తే ప్రాణంగా బ్రతికిన రాజబాపయ్య 1964 జూన్ 24న గుండెపోటుతో మరణించాడు. సంగంజాగర్లమూడి ఉన్నత పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు.<br>రాష్ట్రంలోనే తొలిసారిగా ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షల్లో నూరుశాతం ఫలితాలు సాధించారు. విద్యాబోధనలో వినూత్న, విప్లవాత్మక ప్రక్రియలకు అంకురార్పణ చేసి, ఎందరికో ఆదర్శనీయులైనారు. ఆయన కృషిని కేంద్రం గుర్తించి, ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్రపతి ఎవార్డుతో సత్కరించింది. అయన కుటుంబ సభ్యులు వివిధ రంగాలలో (ముఖ్యంగా విద్య, ఆరోగ్యం) నిష్ణాతులై ప్రముఖులుగా గుర్తింపు పొందారు.

No comments:

Post a Comment