Monday, April 4, 2011

ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి


వికీపీడియా నుండి

కొత్త సచ్చిదానందమూర్తి


కొత్త సచ్చిదానంద మూర్తి
కొత్త సచ్చిదానందమూర్తి (ఆంగ్లం: Kotha Satchidananda Murty) ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. బౌద్ధమతముపై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి( 87). తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు. ఆయన భార్య వేదవతీదేవి. నలుగురు కుమారులున్నారు.

[]బాల్యం

గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1924లో కొత్త వీరభద్రయ్య, రాజరత్నమ్మ దంపతులకు జన్మించిన సచ్చిదానందమూర్తి భారతీయ తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారు. దేశంలోని జే ఎన్ టి ‌యూ, వారణాసి హిందూ విశ్వవిద్యాలయము, తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలతో పాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో సైతం సచ్చిదానంద సేవలు అందించటం తత్వశాస్త్రంలో ఈయన ప్రతిభకు నిదర్శనం. సచ్చిదానంద ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' బిరుదుతో ఆయనను సత్కరించింది. తత్వశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డును తొలి సారిగా 1982లో సచ్చిదానందకే ఇచ్చారు.
2007లో భారత తత్వశాస్త్ర పరిశోధనా సంస్థానము రజతోత్సవం సందర్భంగా ఆయనకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. స్వామి ప్రణవానంద తత్వ శాస్త్ర జాతీయ బహుమతి, శృంగేరీ పీఠం అందించే విద్యాసాగర అవార్డు, కాశీ సంస్కృత విద్యాలయం ప్రదానం చేసిన వాచస్పతి తదితర అవార్డులనూ ఈయన పొందారు. 1995లో తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం 'మహామహోపాధ్యాయ' అనే అరుదైన గౌరవాన్ని సచ్చిదానందకు ఇచ్చి గౌరవించింది.
జర్మనీ, రష్యాలోని పలు సంస్థలు కూడా సచ్చిదానందకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ బిరుదులు ఇచ్చి సత్కరించాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానంద మూర్తి పేరిట "ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ" పేరుతో తత్వ శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆయన కీర్తికి నిదర్శనం. తత్వశాస్త్రంపై సచ్చిదానందమూర్తి 1952లో రాసిన 'ఎవల్యూషన్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియా' అనే గ్రంథానికి ఎం. ఎన్. రాయ్ పీఠిక రాయడం విశేషం.
సర్వేపల్లి వారసుడు: భారతీయ తత్వశాస్త్ర నిపుణుల్లో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రథములైతే ఆయన వారసుడు ప్రొఫెసర్‌ సచ్చిదానందమూర్తి. ఈ విషయంలో దేశంలోని తత్వశాస్త్ర నిపుణులందరిదీ ఏకాభిప్రాయమే. సర్వేపల్లికి, సచ్చిదానందమూర్తికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. సర్వేపల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగం అధిపతిగా అయిదేళ్లపాటు పనిచేశారు. సచ్చిదానందమూర్తి ఆ విభాగంలో విద్యసభ్యసించి అక్కడే మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. రాధాకృష్ణన్‌ భారత ఉప రాష్ట్రపతి అయిన తరువాతే ఆయనతో పరిచయం జరిగింది. ఆయన పలుమార్లు ఢిల్లీకి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించేవారు. తత్వశాస్త్ర అధ్యయనంలో సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారు. పాఠశాల, కళాశాల విద్య అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ పూర్తి చేసి, పీహెచ్‌డీ అందుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొద్దికాలం అధ్యాపక వృత్తి స్వీకరించారు. తర్వాత ఆచార్యుడిగా మయూర్‌భంజ్‌లో పనిచేశారు. 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్‌ యూనివర్శిటీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 1975-78 మధ్య పలు విద్యా విధానాలకు నాంది పలికారు. 1986-89 కాలంలో యూజీసీ ఉపాధ్యక్షుడిగా, సారనాథ్‌లోని విశ్వవిద్యాలయ స్థాయిగల సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టిబెటన్‌ స్టడీస్‌ సంస్థకు ఛాన్సలర్‌ హోదాలో1989-2001 వరకూ పనిచేశారు.
ఆచార్య సచ్చిదానందమూర్తి వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఆటలు ఆడే వయసులో పురాణ ఇతిహాసాలను అవపాసన పట్టిన నిత్యసోదకుడు. మాతృభాషతో పాటు సంస్కృతం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. అందరిలా కాక తన ఆలోచనలను తత్వశాస్త్రాల వైపు మళ్ళించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఎన్నో రచనలు చేశారు. టిబెట్‌ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. తెనాలి మండలం సంగంజార్లమూడికి చెందిన సచ్చిదానందమూర్తి 1924లో రత్నాంబ, వీరభద్రయ్య దంపతులకు సంగంజాగర్లమూడిలో జన్మించారు.
బాల్యం: సంగంజాగర్లమూడిలో జన్మించిన సచ్చిదానందమూర్తి బాల్యం అందరిలా సరదాగా గడిచిపోలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కొత్త విషయాలు అన్వేషించటంలోనే ఉండేవి. స్వగ్రామంలోనే ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తర్వాత గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం (వాల్తేరు)లో డిగ్రీ పూర్తిచేశారు. తత్వశాస్త్రంలోనే కావటం దానిపై ఆయనకున్న ఆసక్తిని చూపుతుంది. 1956లో ఇక్కడే తత్వశాస్త్రంలో పి.హెచ్‌.డి. పూర్తిచేశారు.
ప్రొఫెసర్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్‌.డి. పూర్తిచేసిన మూర్తి 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ స్వదేశానికి వచ్చి 1960లో తాను విద్యనభ్యసించిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆచార్యునిగా చేరారు. 1963లో బీజింగ్‌లోని చైనా పీపుల్స్‌ విశ్వవిద్యాలయం ఆచార్యుని‌గా పనిచేశారు. మద్యలో జె.ఎన్‌.టి.యు. ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏడేళ్లకే గుంటూరు యూనివర్శిటీ పి.జి. సెంటర్‌కు ప్రత్యేకాధికారిగా వచ్చారు. ఇక్కడ 1971 వరకు పనిచేసిన ఆయన జిల్లాలో కళాశాలల అభివృద్ధికి విశేష కృషిచేశారు. 1975 నుంచి నాలుగేళ్ల పాటు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. 1986లో విశ్వవిద్యాలయాల గ్రాంట్స్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడుగా, 1989 నుంచి సారనాధ్‌సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టిబెటన్‌ స్టడీస్‌కు కులపతిగా పనిచేశారు. అప్పుడే టిబెట్‌తో మంచి సంబంధాలేర్పడ్డాయి. తర్వాత విదేశాల్లో చాలాచోట్ల తత్వశాస్త్రంపై ప్రసంగాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్‌ దేశాల్లో పర్యటించారు. ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
టిబెట్‌తో అవినాభావ సంబంధాలు: టిబెట్‌తో సచ్చిదానందమూర్తికి మంచి సంబంధాలే ఉన్నాయి. 1989లోనే టిబెటన్‌ స్టడీస్‌ సెంటర్‌కు కులపతిగా పనిచేసిన రోజుల్లో అక్కడి వారితో అవినాభావ సంబంధమేర్పడింది. పలుమార్లు దలైలామాతో కలిసి పలు తత్వ విషయాలపై పరిశోధనాంశాలను చర్చించారు.
బిరుదులు: తత్వశాస్త్రం పై అనేక పరిశోధనలు, గ్రంథ రచనలు చేసిన సచ్చిదానందమూర్తికి అందిన బిరుదులు, పురస్కారాలు అంతే స్థాయిలో ఉన్నాయి. ఆయన రచించిన పుస్తకాలే ఎనలేని గుర్తింపు తెచ్చాయి. తెలుగులో 12 గ్రంథాలు, ఆప్రో, ఏషియన్‌ తత్వ శాస్త్రాలపైనా ఆంగ్లంలో 30 గ్రంథాలు రచించారు. ఈ తరహా కృషికే మొదటిసారి డాక్టర్‌ బి.సి.రాయ్‌ అవార్డు సచ్చిదానందమూర్తికి దక్కింది. ఈ అవార్డును 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసింది. తత్వ శాస్త్రంతో పాటు విద్వావిధానంలో సాధించిన ప్రగతికి 1984లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందాయి.

[మార్చు]పదవులు, పురస్కారములు

  • ఉపాధ్యక్షుడు- యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్
  • అధ్యక్షుడు - ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్
  • దాక్టర్ ఫిలసాఫియే హానోరిస్ కాసా- రష్యా అకాడెమీ ఆఫ్ సైన్సెస్ - 1989
  • ఛైనా విశ్వవిద్యాలయము, బీజింగ్- తత్వశాస్త్రములో గౌరవ పట్టా- 1988
  •  
  •  
  • గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1924లో కొత్త వీరభద్రయ్య, రాజారత్నమ్మ దంపతులకు జన్మించిన సచ్చిదానందమూర్తి.. భారతీయ తత్వశ్రాస్తాన్ని విశ్వవ్యాప్తం చేశారు. దేశంలోని జేఎన్‌యూ(వారణాసి), హిందూ, బెనారస్ తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలతో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో సైతం సచ్చిదానంద సేవలు అందించటం తత్వశాస్త్రంలో ఈయన ప్రతిభకు నిదర్శనం. సచ్చిదానంద ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' బిరుదుతో ఆయనను సత్కరించింది. తత్వశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డును తొలి సారిగా 1982లో సచ్చిదానందకే ఇచ్చారు.

    2007లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫిలాసఫికల్ రీసెర్చ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆయనకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. స్వామి ప్రణవానంద తత్వ శాస్త్ర జాతీయ బహుమతి, శృంగేరీ పీఠం అందించే విద్యాసాగర అవార్డు, కాశీ సంస్కృత విద్యాలయం ప్రదానం చేసిన వాచస్పతి తదితర అవార్డులనూ ఈయన పొందారు. 1995లో తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం 'మహామహోపాధ్యాయ' అనే అరుదైన గౌరవాన్ని సచ్చిదానందకు ఇచ్చి గౌరవించింది.

    జర్మనీ, రష్యాలోని పలు సంస్థలు కూడా సచ్చిదానందకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ బిరుదులు ఇచ్చి సత్కరించాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానంద మూర్తి పేరిట ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ పేరుతో తత్వ శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆయన కీర్తికి నిదర్శనం. తత్వశాస్త్రంపై సచ్చిదానందమూర్తి 1952లో రాసిన 'ఎవల్యూషన్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియా' అనే గ్రంథానికి ఎం.ఎన్.రాయ్ పీఠిక రాయడం విశేషం.
    భారతీయ తత్వశ్రాస్తానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి(87) పరమపదించారు. తత్వవేత్తగా 50కిపైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాసిన ఆయన   సోమవారం గుంటూరులో కన్ను మూశారు. ఆయనకు భార్య వేదవతీదేవి, నలుగురు కుమారులున్నారు.
 కాగా.. సచ్చిదానందమూర్తి మరణంపై ప్రముఖ హేతువాది నరిశెట్టి ఇన్నయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

భారతీయ తత్వశాస్త్రం ఓ మహనీయుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సచ్చిదానంద మూర్తి మృతికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. వైస్ చాన్స్‌లర్‌గానూ, ఇతర రంగాల్లోనూ మూర్తి అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. మూర్తి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సచ్చిదానంద మూర్తి మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

Former SV varsity VC passes away

TIMES NEWS NETWORK


Hyderabad: Scholar, administrator, author, philosopher and former vice-chancellor of Sri Venkateswara University (SV) Kotta Satchidananda Murty died on Monday after a prolonged illness.
Prof Murty, who has been suffering from severe lung infection, was undergoing treatment at St Joseph Hospital in Guntur. His condition deteriorated on Sunday night. He died on Monday morning. He
was 86. Winner of several awards, Prof Murty was given the prestigious Padma Vibhushan award in 2001 and Pa d m a Bhushan in 1984. Prof Murty hailed from Sangam Jagarlamudi village in Guntur district.
He was a university professor of philosophy for a quarter century and was the first educationist to receive the coveted Dr B C Roy national award in philosophy in 1982. Prof Murty also served as vice-chairman of the University Grants Commission between 1986-89.
A recipient of honorary doctorates of a number of Indian universities, he was also a visiting professor of several foreign universities like the University of Halle-Wittenberg, Germany, the USSR Academy of Sciences, Sofia University, Bulgaria, Princeton University and the People’s University of China. He was also a honorary professor of Jawaharlal Nehru University,
New Delhi, Banaras Hindu University, University of Hyderabad and Andhra University, Vizag.
He has to his credit about 50 books on philosophy, Buddhism and other subjects. He established a centre for studies on peace and non-violence. Since 1980, he was the chairman of the Indian Philosophical Congress and national fellow of the Indian Council of Philosophical Research.
Sources said after leaving SVU and taking residence again in AU, Murty
had done exhaustive research on various dimensions of Buddhism. “His interest in Asian philosophies and religions is impeccable,” a former professor of AU recalled. “He was so good at exploring the highways and byways of Buddhist thought,” he added.
A professor from Nagarjuna University said as a teacher Murty had injected students with his own enthusiasm to build their intellect and future. “He used to organise seminars on world views and other interesting topics. By organising such seminars, Murty was doing what a professor should be doing, and what a university teacher should be doing,” he recalled.
Several professors, academicians and his peers condoled his death. Paying tributes, a AU professor said: “For men like Murty, the whole world is their field of study.”
(The Times of India, 25/01/2011)
 
తత్వం ఆయన పంచప్రాణాలు
ప్రపంచ ఖ్యాతి తెచ్చిన సచ్చిదానందమూర్తి
తెనాలి, -న్యూస్‌టుడే : ఆచార్య సచ్చిదానందమూర్తి.. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఆటలు ఆడే వయసులో పురాణ ఇతిహాసాలను అవపాసన పట్టిన నిత్యసోదకుడు. మాతృభాషతో పాటు సంస్కృతం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. అందరిలా కాక తన ఆలోచనలను తత్వశాస్త్రాల వైపు మళ్ళించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఎన్నో రచనలు చేశారు. టిబెట్‌ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. తెనాలి మండలం సంగంజార్లమూడికి చెందిన సచ్చిదానందమూర్తి సోమవారం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సచ్చిదానందమూర్తి 1924లో రత్నాంబ, వీరభద్రయ్య దంపతులకు సంగంజాగర్లమూడిలో జన్మించారు. బాల్యమిలా గడిచింది...: సంగంజాగర్లమూడిలో జన్మించిన సచ్చిదానందమూర్తి బాల్యం అందరిలా సరదాగా గడిచిపోలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కొత్త విషయాలు అన్వేషించటంలోనే ఉండేవి. స్వగ్రామంలోనే ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తర్వాత గుంటూరు ఎ.సి. కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం (వాల్తేరు)లో డిగ్రీ పూర్తిచేశారు. తత్వశాస్త్రంలోనే కావటం దానిపై ఆయనకున్న ఆసక్తిని చూపుతుంది. 1956లో ఇక్కడే ఫిలాసపీలో పి.హెచ్‌.డి. పూర్తిచేశారు.
ప్రొఫెసర్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్‌.డి. పూర్తిచేసిన మూర్తి 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ స్వదేశానికి వచ్చి 1960లో తాను విద్యనభ్యసించిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరారు. 1963లో బీజింగ్‌లోని చైనా పీపుల్స్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేశారు. మద్యలో జె.ఎన్‌.టి.యు. ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏడేళ్లకే గుంటూరు యూనివర్శిటీ పి.జి. సెంటర్‌కు ప్రత్యేకాధికారిగా వచ్చారు. ఇక్కడ 1971 వరకు పనిచేసిన ఆయన జిల్లాలో కళాశాలల అభివృద్ధికి విశేష కృషిచేశారు. 1975 నుంచి నాలుగేళ్ల పాటు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. 1986లో విశ్వవిద్యాలయాల గ్రాంట్స్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడుగా, 1989 నుంచి సారనాధ్‌సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టిబెటన్‌ స్టడీస్‌కు కులపతిగా పనిచేశారు. అప్పుడే టిబెట్‌తో మంచి సంబంధాలేర్పడ్డాయి. తర్వాత విదేశాల్లో చాలాచోట్ల తత్వశాస్త్రంపై ప్రసంగాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్‌ దేశాల్లో పర్యటించారు. ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
టిబెట్‌తో అవినాభావ సంబంధాలు: టిబెట్‌తో సచ్చిదానందమూర్తికి మంచి సంబంధాలే ఉన్నాయి. 1989లోనే టిబెటన్‌ స్టడీస్‌ సెంటర్‌కు కులపతిగా పనిచేసిన రోజుల్లో అక్కడి వారితో అవినాభావ సంబంధమేర్పడింది. పలుమార్లు దలైలామాతో కలిసి పలు తత్వ విషయాలపై పరిశోధనాంశాలను చర్చించారు.
బిరుదులు ఎన్నెన్నో...: తత్వశాస్త్రం పై అనేక పరిశోధనలు, గ్రంథ రచనలు చేసిన సచ్చిదానందమూర్తికి అందిన బిరుదులు, పురస్కారాలు అంతే స్థాయిలో ఉన్నాయి. ఆయన రచించిన పుస్తకాలే ఎనలేని గుర్తింపు తెచ్చాయి. తెలుగులో 12 గ్రంథాలు, ఆప్రో, ఏషియన్‌ తత్వ శాస్త్రాలపైనా ఆంగ్లంలో 30 గ్రంథాలు రచించారు. ఈ తరహా కృషికే మొదటిసారి డాక్టర్‌ బి.సి.రాయ్‌ అవార్డు సచ్చిదానందమూర్తికి దక్కింది. ఈ అవార్డును 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసింది. తత్వ శాస్త్రంతో పాటు విద్వావిధానంలో సాధించిన ప్రగతికి 1984లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందాయి.



తత్వవేత్త, మార్గదర్శకులు సచ్చిదానందమూర్తి
ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: దివంగత ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గొప్ప తత్వవేత్త అని, అందరికీ మార్గదర్శకులని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.ఆర్‌.హరగోపాల్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాపసభలో హరగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆచార్యునిగా, ఉపకులపతిగా సచ్చిదానందమూర్తి ఎన్నో పదవులు నిర్వహించి అమూల్యమైన సేవలు అందించారన్నారు. యూజీసీ ఉపాధ్యక్షులుగా ఆయన దేశంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు. నాగార్జున వర్సిటీతో సచ్చిదానందమూర్తికి ఎంతో అనుబంధం ఉందని, ఆయన సలహాలు, సూచనలు మరువలేనివని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఆయన పేరు మీద ఉన్న పరిశోధనా కేంద్రాన్ని బలోపేతం చేస్తామని, కేంద్రం సలహాసంఘాన్ని పునర్నియమిస్తామని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి రామకోటయ్య మాట్లాడుతూ సచ్చిదానందమూర్తి గొప్ప పరిపాలనా దక్షులని కొనియాడారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. సమానత్వం, శాంతి అనే సూత్రాలతో ఆయన పయనించారని వివరించారు. నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ దక్షిణామూర్తి మాట్లాడుతూ ఆయన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. రెక్టర్‌ వియన్నారావు మాట్లాడుతూ మూర్తి అందరికి ఆదర్శప్రాయుడన్నారు. రిజిస్ట్రార్‌ శర్మ మాట్లాడుతూ ఉన్నత విద్యాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారన్నారు. ఒఎస్‌డి శామ్యూల్‌, ఆచార్య సి.నరసింహారావు ఆయన గొప్పతనం గురించి వివరించారు. సచ్చిదానందమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అధ్యాపక సంఘం అధ్యక్షులు విష్ణువర్దన్‌, కార్యదర్శి రోశయ్య, వికాస అధ్యక్ష, కార్యదర్శులు బిట్రా సుబ్బారావు, యోబు, టీఎన్‌టీయూసీ కార్యదర్శి ఎం.మల్లేశ్వరరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి వర్సిటీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 27న సంగంజాగర్లమూడిలో సచ్చిదానందమూర్తి అంత్యక్రియలు సందర్భంగా గుంటూరు నుంచి విశ్వవిద్యాలయం బస్సు వేస్తుందని, సిబ్బంది హాజరుకావచ్చని హరగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

నిరంతర తాత్విక అధ్యయనశీలి సచ్చిదానంద
* నెమరువేసుకున్న ఏయూ తత్వశాస్త్ర ఆచార్యులు
ఆంధ్ర విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : గుంటూరులో సోమవారం మృతిచెందిన ప్రపంచ ప్రసిద్ధి తత్వవేత్త ఆచార్య సచ్చిదానందమూర్తిని ఆయన పనిచేసిన ఏయూ తత్వశాస్త్ర విభాగం జ్ఞప్తిచేసుకుంది. నిరాడంబరతకు, సహృదయతకు నిదర్శనం సచ్చిదానందమూర్తి అని ఈ విభాగ ఆచార్యులు అంటున్నారు. ఏయూ వీసీగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో సచ్చిదానందమూర్తి ప్రతిభను గమనించి అధ్యాపక వృత్తిని ఇచ్చారన్నారు. 1984లో పదవీవిరమణ చేసిన ఆయన 35 ఏళ్లకుపైగా బాధ్యతలను నిర్వహించారు. మన దేశం నుంచి తత్వశాస్త్రం, వేదాంత బోధనలో సర్వేపల్లి తరువాత అంత కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు. ఒకే కోణంలో ఆలోచించకుండా విశ్వవ్యాప్త దృక్పథంతో ఆయన ఉపన్యాసాలు ఉంటాయని శిష్యుడు జార్జ్‌ విక్టర్‌ అన్నారు. విస్తృత అవగాహన, సమగ్ర అధ్యయనం విద్యకు ప్రాతిపదిక కావాలని భావించేవారన్నారు. విశాఖలో చివరిసారిగా సచ్చిదానందమూర్తి చేసిన ప్రసంగంలో 'ఆలోచనాపరులైన హిందువులు బైబిల్‌ను, క్రైస్తవులు భగవద్గీతను చదవాలని' అన్నారని గుర్తుచేసుకున్నారు. సచ్చిదానందమూర్తిపై పరిశోధన: సచ్చిదానందమూర్తి తత్వశాస్త్రానికి అందించిన సేవలపై ఆచార్య జార్జి విక్టర్‌ ఆధ్వర్యంలో డా.బి.బోయజ్‌ అనే అధ్యాపకుడు 2004లో పరిశోధన చేశారు. సచ్చిదానంద ఆంగ్లంలో 1947లో రాసిన హిందూ మతాభివృద్ధి, 1952లో రాసిన భారతదేశ తత్వశాస్త్ర పరిణామ క్రమంను ఇటీవల ఢిల్లీ పబ్లిషర్స్‌ కూడా ముద్రించారు. సచ్చిదానందమూర్తి పాఠం వినాలనే ఆసక్తితో ఆయన ప్రత్యేకంగా బోధించే చైనీస్‌, జపనీస్‌ బుద్ధిజం అంశాన్ని తాను తీసుకున్నానని ఆచార్య రజని గుర్తుచేసుకున్నారు. సచ్చిదానందకు భారతరత్న ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందని తత్వశాస్త్ర విభాగాధిపతి ఆచార్య వీర్రాజు అభిప్రాయపడ్డారు.

సచ్చిదానందమూర్తి సేవలు శ్లాఘనీయం
యూనివర్సిటీ క్యాంపస్‌, న్యూస్‌టుడే: ప్రముఖ తత్వవేత్త, ఎస్వీయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ సచ్చిదానందమూర్తి విద్యారంగానికి చేసిన సేవలు శ్లాఘనీయమని ఎస్వీయూ వీసీ ఎన్‌.ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయంలోని సెనేట్‌ హాలులో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. ఎస్వీయూ అభివృద్ధికి సచ్చిదానంద మూర్తి చేసిన సేవలను కొనియాడారు. తత్వశాస్త్రంలో అమోఘ ప్రతిభను కనబరిచారన్నారు. ఈ సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందజేసిందన్నారు. ఐసీపీఆర్‌ నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారని వెల్లడించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి ఎస్వీయూకు వీసీగా పనిచేయడం గర్వించదగ్గ విషయమన్నారు. తర్వాత సచ్చిదానందమూర్తి సేవలను రెక్టార్‌ కె.రత్నయ్య, రిజిస్ట్రార్‌ జె.ప్రతాప్‌రెడ్డి కొనియాడారు. అంతకు మునుపు తత్వశాస్త్ర విభాగంలో విభాగాధిపతి ప్రొఫెసర్‌ అబ్దుల్‌ సత్తార్‌ ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేసి ప్రొఫెసర్‌ మూర్తి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు జయంతరావు, సిద్ధయ్య, వెంకటేశ్వర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
 
  •  

No comments:

Post a Comment